కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెన్నూరు మండలంలోని కిష్టంపేటకు చెందిన కాంగ్రెస్ లీడర్ తిరుపతిరెడ్డిని మంగళవారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అండగా ఉంటానని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు.
