
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ అక్రమమే అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తుందన్నారు. నీటి తరలింపుపై ఏపీ సర్కార్ చెబుతున్నా లెక్కలన్నీ అబద్ధాలే అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సక్రమమైతే పనులు ఆపాలని కృష్ణాబోర్డు ఎందుకు ఆదేశించిందో ఏపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఏపీ సర్కార్ చేపట్టే అక్రమ ప్రాజెక్టులన్నీ ఆపాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డి.