బీజేపీ ప్రభుత్వంలో పార్లమెంట్​కే రక్షణ లేదు.. దేశానికి భద్రత ఉంటుందా?

బీజేపీ  ప్రభుత్వంలో పార్లమెంట్​కే రక్షణ లేదు.. దేశానికి భద్రత ఉంటుందా?

పార్లమెంట్​ కి భద్రత కల్పించడంలో NDA ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ మంత్రి శ్రీధర్​ బాబు అన్నారు.  పార్లమెంట్​భవనానికే రక్షణ కల్పించలేని వారు దేశానికి భద్రత ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా చట్టాలు చేయుచూ... ప్రతిపక్ష ఎంపీల గొంతు నొక్కుతూ సభనుంచి సస్పెండ్​ చేశారన్నారు.  గతంలో టీఆర్ఎస్​ ప్రభుత్వం ధర్నాచౌక్​ను తీసేస్తే .... హైకోర్టు ధర్నా చౌక్​కు అనుమతి ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.  తెలంగాణ ప్రజలు ఆలోచించి నిరంకుశత్వ ప్రభుత్వాన్ని తొలగించారంటూ...  నియంతృత్వ ధోరణి అవలంభించే బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా... తొలగించాలా ప్రజలు ఆలోచించాలన్నారు. 

పార్లమెంటులో కాంగ్రెస్​ ఎంపీలను సస్పెండ్​ చేయడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు.  ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్​ చేసి.. బీజేపీ ప్రభుత్తం  బిల్లులను పాస్​ చేసుకోవడం ప్రజాస్వామ్య విరుద్దమన్నారు.  కేంద్రంలో మోదీ సర్కార్​ నియంతృత్వంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.  మోదీ ప్రభుత్వం  అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ఆలోచించాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలంగాణ ప్రజలను కోరారు.