రాష్ట్రంలో బీజేపీ రౌడీయిజం చేస్తోంది

రాష్ట్రంలో బీజేపీ రౌడీయిజం చేస్తోంది

ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులు పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సూటిగా కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నందునే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తున్నారని.. బీజేపీ వచ్చినప్పటి నుంచి 20 వేల ఈడీ దాడులు జరిగాయన్నారు. బీహార్, ఢిల్లీ,మహారాష్ట్ర ఇలా ఒక్కో రాష్ట్రాన్ని కేంద్రం టార్గెట్ చేస్తోందని విమర్శించారు. రాజాసింగ్ విషయంలో స్పీకర్ చట్టప్రకారంగా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని.. కవిత ఇంటి దగ్గర బీజేపీ కార్యకర్తల స్కెచ్ ప్రకారమే ఆందోళనలు చేశారన్నారు.

రాష్ట్రంలో బీజేపీ రౌడీ ఇజం చేస్తోంది

రాష్ట్రంలో బీజేపీ రౌడీయిజం చేస్తోందని హోంమంత్రి మహుముద్ అలీ అన్నారు. తప్పు చేస్తే బీజేపైనా..ఎంఐఎం అయిన వదిలిపెట్టం అని చెప్పారు. రాజాసింగ్పై పీడీయాక్ట్ అంశాన్ని పోలీసులు చూసుకుంటారన్నారు. బీజేపీ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తోందని..రాజసింగ్ వ్యాఖ్యలతో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నట్లు తెలిపారు.