పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా

పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా

ఆసిఫాబాద్, వెలుగు: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఐఎన్ టీయూసీ అధ్వర్యంలో మంగళవారం ఆసిఫాబాద్​లోని మిషన్ భగీరథ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఐఎన్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను ఎల్ అండ్ టీ యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్షం చేస్తోందని మండిపడ్డారు.

మిషన్ భగీరథ కార్మికుల వేతనాలను ప్రతినెలా చెల్లించాలని, వేతనాల జీఓలను సవరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అర్హులైన కార్మికులకు ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. కార్మికులు బాలేశ్, హరీశ్, వినేశ్, మహేశ్, సోహెల్, తదితరులు పాల్గొన్నారు.