నిజామాబాద్ రూరల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నిజామాబాద్ నగర శివారులోని విలీన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ముబారక్నగర్, గూపన్పల్లి గ్రామాల్లో రూ.2 కోట్లతో చేపట్టిన పలు అబివృద్ది పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ శివారులో ఉన్న 8 గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కాగా, గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధి చెందలేదన్నారు.
నగరంలో కలిసినప్పటికీ కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత గూపన్పల్లి, ముబారక్నగర్ గ్రామాల్లో రూ.6 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టానని తెలిపారు. త్వరలో జరగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి, విలీన గ్రామాలను మరింత డెవలప్ చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, హన్మాండ్లు, సంజీవ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.
