నిజామాబాద్అర్బన్, వెలుగు: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ పరిధిలోని బాధితులకు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధ పడే పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
అర్బన్ నియోజకవర్గంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా అండగా ఉంటానన్నారు. వంద మందికి రూ.26 లక్షల 49వేల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
