కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి

కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
  • లేకపోతే బల్దియా ఆఫీస్​ను ముట్టడిస్తాం 
  • ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి 

అమీన్​పూర్, వెలుగు: కిష్టారెడ్డిపేట కేంద్రంగా కొత్త డివిజన్​ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి డిమాండ్​ చేశారు. అమీన్​పూర్​మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీ డివిజన్ల ఏర్పాటు పద్ధతి ప్రకారం జరగలేదని, 4 డివిజన్లకు రెండే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కిష్టారెడ్డిపేట డివిజన్​ కోసం 8 గ్రామాల ప్రజలు అఖిలపక్షం ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేటలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష మేరకు అమీన్​పూర్​మున్సిపాలిటీలో మరో 2 డివిజన్లు ఏర్పాటు చేయాలన్నారు.

పటాన్​చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్​పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి, 6 డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా గూగుల్​మ్యాప్​ఆధారంగా డివిజన్లు ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొన్నారు. కొత్తగా 2 డివిజన్లు ఏర్పాటు చేయకపోతే సంక్రాంతి తర్వాత హైదరాబాద్ బల్దియా ఆఫీస్​ను 10 వేల మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు,  అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. 

భానూరు ఎల్లమ్మ జాతరకు హాజరు 

పటాన్​చెరు మండలం భానూరులో ఆదివారం నిర్వహించిన రేణుక ఎల్లమ్మ జాతరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరై, అమ్మవారికి పూజలు చేశారు. ఇస్నాపూర్​మున్సిపాలిటీ రుద్రారంలో మల్లన్న జాతరకు హాజరయ్యారు. చిట్కుల్​లో జీసస్​ హౌస్​చర్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాయకులు శ్రీశైలంయాదవ్​, ఉపేందర్​రెడ్డి, నరేందర్​రెడ్డి, శాంతయ్య, దశరథరెడ్డి, వెంకటరెడ్డి తదితరులున్నారు.  

మల్లన్న, సోమేశ్వరునికి పూజలు

రామచంద్రాపురం: తెల్లాపూర్ లో ఆదివారం నిర్వహించిన మల్లన్న జాతర, రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మందుమూల శ్రీశ్రీ సోమేశ్వర కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి హాజరయ్యారు. స్వామివార్లకు పూజలు చేశారు. పటాన్​చెరు నియోజకవర్గ ప్రజలు కుల, మత, వర్గాల ప్రస్తావన లేకుండా పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​లలిత, కార్పొరేటర్ పుష్ప, మాజీ కౌన్సిలర్లు, నగేశ్ యాదవ్​, పరమేశ్, గోవింద్, అంజయ్య, ఐలేశ్​యాదవ్​తదితరులు పాల్గొన్నారు.