- ఎమ్మెల్మే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్(పటాన్చెరు), వెలుగు: అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పటాన్చెరులోని క్యాంపు ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో 194 మంది లబ్ధిదారులకు రూ.కోటి 94 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ..కల్యాణ లక్ష్మి పేదింటి ఆడిపిల్లల వివాహాలకు కొండంత అండగా నిలుస్తుందన్నారు.
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని సుల్తాన్పూర్కు చెందిన కటకం శాలిని అనారోగ్యంతో బాధపడుతుండడంతో మెరుగైన వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.3.50లక్షల ఎల్వోసీ పత్రాలను ఆమె కుటుంబీకులకు అందజేశారు.
