క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్​(గుమ్మడిదల), వెలుగు: క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల పట్టణంలో సీజీఆర్​ట్రస్ట్​ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్​ టూ ఆల్​ కబడ్డీ, వాలీబాల్​ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు, యువకుల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సీజీఆర్​ ట్రస్టు చైర్మన్, బీఆర్ఎస్​ జిల్లా నాయకుడు గోవర్దన్​రెడ్డి,  మాజీ జడ్పీటీసీ కుమార్​గౌడ్,  నాయకులు విజయభాస్కర్​రెడ్డి, శ్రీనివాస్​ రెడ్డి, నర్సింహారెడ్డి, హుస్సేన్​, సీఐ రమణారెడ్డి,  క్రీడాకారులు పాల్గొన్నారు.  

రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

పటాన్​చెరు మండలం క్యాసారంలో రూ.30 లక్షలతో కల్వర్టు, ఇస్నాపూర్​ మున్సిపల్​ పరిధిలోని లక్డారంలో రూ.20లక్షల ఎస్సీ సబ్​ ప్లాన్​ నిధులతో చేపట్టే డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పటాన్​చెరు పట్టణంలోని శ్రీనగర్​ కాలనీకి చెందిన బసప్ప కుటుంబ సభ్యులకు సీఎంఆర్​ఎఫ్​ ద్వారా మంజూరైన రూ.2.50 లక్షల ఎల్​వోసీని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో అందజేశారు. 

ఇస్నాపూర్​ మున్సిపల్​ కమిషనర్​ వెంకట కిషన్, మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, నాయకులు వెంకట్​రెడ్డి, ప్రభాకర్, రమేశ్, లక్ష్మణ్, గోపాల్, క్యాసారం సర్పంచ్​ సంగీత గోవర్దన్​రెడ్డి,  శ్రీశైలంయాదవ్​ పాల్గొన్నారు.