- స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలోని గజదొంగకు ముగ్గురు స్టూవర్ట్పురం దొంగలు తోడయ్యారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టేషన్ ఘన్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది పల్లా రాజేశ్వర్రెడ్డి అని తెలిపారు.
టీడీపీని హోల్సేల్గా అమ్మిన నీచ చరిత్ర ఎర్రబెల్లి దయాకర్రావుకు ఉందన్నారు. కేసీఆర్ చుట్టూ కుక్కలా తిరిగిన ఎర్రబెల్లి రూ.వేల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. కేటీఆర్, సంతోష్రావు సంపాదించిన ఆస్తులకు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి బినామీగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.
వీళ్లందరూ తాటికొండ రాజయ్యను ఉద్ధరించడానికి రాలేదని, బొంద పెట్టడానికే వచ్చారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చేసిన చిల్లర పనులతో నియోజకవర్గం తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. జనగామ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాతే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
