12 ఏండ్లుగా పిల్లర్లకే పరిమితం..రుద్రవెళ్లి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి

12 ఏండ్లుగా పిల్లర్లకే పరిమితం..రుద్రవెళ్లి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి

యాదాద్రి, వెలుగు: పెండింగ్​లో ఉన్న రుద్రవెళ్లి హైలెవల్​ బ్రిడ్జి పనులను వెంటనే చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు.  కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం కారణంగా మూసీపై బ్రిడ్జి నిర్మాణం 12 ఏండ్లుగా పిల్లర్లకే పరిమితమై పోయిందన్నారు. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 

పాత కాంట్రాక్ట్​ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని ఆయన కోరారు. సంగెం వద్ద మూసీపై బ్రిడ్జి నిర్మాణం కోసం టెండర్లు పిలవాలన్నారు.  భువనగిరి -చిట్యాల రోడ్డును 'హ్యామ్​' స్కీమ్​ కింద నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించాలని ఎమ్మెల్యే కోరారు.  మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.