
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఎర్రజండా చూస్తే భయపడుతున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే.. సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన సీపీఐ 4వ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేస్తున్న మావోయిస్టులను ఎందుకు చంపుతున్నారని కూనంనేని ప్రశ్నించారు.
ALSO READ | కల్తీ విత్తనాల విషయంలో ఉక్కుపాదం మోపాం: మంత్రిశ్రీధర్ బాబు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టన ఆపరేషన్ కగార్ ఆపకపోతే హిట్లర్ కు పట్టిన గతే పడుతుందని ఆయన హెచ్చరించారు. మావోయిస్టుల ఏరివేతను బేషరతుగా నిలిపివేయాలనీ డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మావోయిస్టులు అరణ్యం వీడి మాతో కలిసి రావాలనీ పిలుపునిచ్చారు. వామపక్ష వాదులందరూ ఒక్కతాటిపైకి వస్తే బీజేపీ కి ప్రత్యామ్నాయంగా ఎదుగుతామన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ఎర్రజెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పెద్దలు మతం, కులం పేరుతో ప్రజలను విభజించి పాలిస్తున్నారనీ విమర్శించారు.