అభివృద్ధిని చూసి కాంగ్రెస్ లో చేరుతున్నారు : ఎమ్మెల్యే మదన్మోహన్రావు

అభివృద్ధిని చూసి కాంగ్రెస్ లో చేరుతున్నారు : ఎమ్మెల్యే మదన్మోహన్రావు
  • కాంగ్రెస్​లో చేరిన 70 మంది బీజేపీ నాయకులు 

సదాశివనగర్, వెలుగు : ఎల్లారెడి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందుకోసం ఇతర పార్టీల నుంచి నాయకులు కాంగ్రెస్​ పార్టీలో చేరుతున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్​ మోహన్​ రావు అన్నారు. ఆదివారం సదాశివనగర్​ మండల కేంద్రంలోని ఫంక్షన్​ హాల్​ లో ఏర్పాటు చేసిన సమవేశంలో బీజీపీ నుంచి 70 మంది నాయకులు కాంగ్రెస్​ చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎంతో అభివృద్ది చెందిందన్నారు. సదాశివనగర్​ మాజీ వైస్​ ఎంపీపీ గాదారి శ్రీనివాస్​ రెడ్డి ఆధ్యర్యంలో  సదాశివనగర్​ మండల బీజేపీ ఓబీసీ మోర్చా మండల పార్టీ అధ్యక్షుడు కటికి రమేశ్, బూత్​ అధ్యక్షుడు నల్ల సత్యంరెడ్డి, ప్రభులింగం, కుంట సుదర్శన్, శ్రీకాంత్​, సుతారి సత్యం,  బీఎంసీ చైర్మన్​ వంగిటి రాఘవరెడ్డి, నర్సింగ్​ రావు,తో పాటు 70 మంది పార్టీలో చేరినట్లు తెలిపారు.

 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంగారెడ్డి, జిల్లా సేవాదళ్​అధ్యక్షుడు లింగాగౌడ్, సీడీసీ చైర్మన్​ ఇర్షాదోద్దిన్, మాజీ వైస్​ ఎంపీపీ నోముల రూపేందర్​రెడ్డి, నియోజక వర్గం యూత్​ అధ్యక్షుడు సంపత్​ గౌడ్​, ఏఎంసీ మాజీ వైస్​ చైర్మన్​ వడ్ల రాజేందర్​చారి, మండల యూత్​ అధ్యక్షుడు అన్వేశ్​గౌడ్​, మండలంలోని వివిద గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.