లింగంపల్లి ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతా : మధన్ మోహన్ రావు

లింగంపల్లి ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతా  : మధన్ మోహన్ రావు
  • ఎమ్మెల్యే మధన్ మోహన్ ​రావు   

సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లిని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి లో రూ. 2 కోట్ల 40 లక్షల నిధులతో మిషన్​ భగీరథ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇక్కడికి కంపెనీలు వస్తే నియోజకవర్గ యువకులకు  ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కాళేశ్వరం 22 వ ప్యాకేజీ పనులకు ప్రభుత్వం రూ 23 కోట్లు విడుదల  చేసిందన్నారు. 

భూంపల్లి, మోతే, కాటేవాడి జలాశయాల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పద్మాజివాడి, తుక్కోజివాడి, మర్కల్, రామారెడ్డి గ్రామాల్లో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, ​గ్రామాధ్యక్షుడు గంగారాం, జిల్లా సేవాదళ్​అధ్యక్షుడు లింగాగౌడ్​, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాగయ్య, ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్​ అధ్యక్షుడు సంపత్ గౌడ్​, ఏఎంసీ చైర్మన్ సంగ్యా నాయక్, సింగిల్​విండో చైర్మన్ గంగాధర్, మాజీ వైస్​ ఎంపీపీలు శ్రీనివాస్​ రెడ్డి, రూపేందర్​ రెడ్డి దితరులు పాల్గొన్నారు.