బల్దియా డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

బల్దియా డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గంలోని జీహెచ్​ఎంసీ డివిజన్ల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం భారతీనగర్​, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో రూ. 5 కోట్ల 65 లక్షల నిధులతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. హెచ్​ఐజీ మాధవ నగర్​లో, మ్యాక్​సొసైటీ, మల్లికార్జున నగర్​ కాలనీ, మయూరి నగర్, ఆర్​సీరెడ్డి నగర్​ తదితర కాలనీల్లో కార్పొరేటర్లు సింధూ ఆదర్శ్​రెడ్డి, పుష్ప నగేశ్​తో కలిసి పనులను ప్రారంభించారు. 

ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, జీహెచ్​ఎంసీ అధికారుల సమన్వయంతో డివిజన్ల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. స్థానిక ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. 

సీనియర్​ సిటిజన్లకు భవనాలు, పార్కులు, ఓపెన్​ జిమ్​ల ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే సీసీ రోడ్లు, యూజీడీ, తాగునీటి పైప్​లైన్లు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమీన్​పూర్ డిప్యూటీ కమిషనర్​ ప్రదీప్ కుమార్, డీఈ వెంకటరమణ, అంజయ్య, పరమేశ్​యాదవ్, ఐలేశ్, ప్రమోద్​గౌడ్, శ్రీనివాస్, సలీం, సుబ్రహ్మణ్యం, ప్రభాకర్​, బీఎన్​రెడ్డి, పాపయ్య పాల్గొన్నారు.

 నిరుపేదలకు వరం సీఎంఆర్​ఎఫ్

అమీన్​పూర్​(పటాన్​చెరు): నిరుపేదలకు వరం సీఎంఆర్​ఎఫ్​ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.  జిన్నారం మున్సిపల్ పరిధిలోని వావిలాల గ్రామానికి చెందిన ఆరేళ్ల శంకర్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఎమ్మెల్యే ద్వారా ఎల్ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు  సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన లక్ష  ఎల్ఓసీని  మంగళవారం సాయంత్రం పటాన్​చెరులోని క్యాంపు ఆఫీసులో శంకర్ కుటుంబీకులకు అందజేశారు.