- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: పార్టీలకు అతీతంగా అందరి సమన్వయంతో కాలనీలను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. రామచంద్రాపురం జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని కాలనీ వాసులు గురువారం ఎమ్మెల్యేను కలిశారు. ఇటీవల కాలనీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెన్నవరం మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. కాలనీల వెల్ఫేర్ సంఘాలు, అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కాలనీ యువకులు పాల్గొన్నారు.
