- ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి
వర్ని, వెలుగు : బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మోస్రా సర్పంచ్ గా పోటీ చేస్తున్న బిల్ల రాజశేఖర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉందని అభ్యర్థిని గెలిపిస్తే మోస్రా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో అగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, వర్ని ఏఎంసీ వైస్చైర్మన్ కోత్మిర్కర్ లక్ష్మణ్, నాయకులు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.

