మంత్రి కేటీఆర్కు రఘునందన్ సవాల్

మంత్రి కేటీఆర్కు రఘునందన్ సవాల్

మంత్రి కేటీఆర్కు బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు,  సొంత జాగలో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ. 7.5 లక్షలు మంజూరు చేస్తే  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. దమ్ముంటే ఈ రెండు పథకాలను దుబ్బాకలో అమలు చేయాలని మంత్రి కేటీఆర్ ను డిమాండ్ చేశారు. దుబ్బాకలోని  చెల్లాపూర్ వార్డులో నిర్వహించిన "ప్రజా గోస - బీజేపి భరోసా" కార్నర్ సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచినా  చెల్లాపూర్ వార్డులో ఇళ్లు లేని నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టించలేదని విమర్శించారు. దీనిపై అసెంబ్లీలో తాను ప్రశ్నిస్తే కేటీఆర్  తనపై ఎగతాళిగా మాట్లాడడం బాధాకరమన్నారు. దుబ్బాకలో తనని  ఓడగొట్టేందుకు ప్రచారం చేస్తామని మంత్రి కేటీఆర్  చెప్పడం హాస్యాస్పదమని చెప్పారు. తనని ఓడగొట్టాడానికి జిమ్మిక్కులు అవసరం లేదన్నారు.