
దుబ్బాక, వెలుగు: రైలు యాక్సిడెంట్ అయితే అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్బహుదూర్శాస్త్రి తన పదవికి రాజీనామా చేశారని, 30 లక్షల మంది నిరుద్యోగులు రాసిన టీఎస్పీఎస్సీ పరీక్షా పేపర్లు లీకయితే సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించకపోవడం ఏమిటని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం దుబ్బాకలో టీఎస్పీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల ఆవేదన, తల్లిదండ్రుల ఉసురు కేసీఆర్ కుటుంబానికి తగుల్తదన్నారు. మంత్రి కేటీఆర్అహంకారంతో మీడియాను బెదిరిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్తన బిడ్డను లిక్కర్ క్వీన్గా తయారు చేశారని, చెల్లె ఎక్కడ జైలుకు పోతుందేమోనని మంత్రి కేటీఆర్ అడ్డదారులను వెతుక్కోవడానికి ఢిల్లీకి పోయాడన్నారు. గ్రూప్ వన్పేపర్ లీకైందన్న ఆవేదనతో
సిరిసిల్లలో నవీన్ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాన్ని పరామర్శించే టైం ఆయనకు లేకుండా పోయిందన్నారు. కేటీఆర్, కవితకు అనుకూలంగా ఉన్న అనుచరుల పిల్లలకే టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు వచ్చాయని, ఒక్కొక్క ఊరిలో పదుల సంఖ్యలో గ్రూప్స్లో అర్హత ఎలా సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. బాధ్యులైన మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.