హుజురాబాద్ లో టీఆర్ఎస్ ,కాంగ్రెస్ స్థానం ఏమిటని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కుట్రకు తెరలేపారన్నారు. హుజురాబాద్ లో ఓటమి తప్పదనే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ కాంగ్రెస్ లు కలిసి ఎక్కడ పోటీ కూడా చేయలేదన్నారు. 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పాలు పంచుకున్నాయన్న విషయం అందరికి తెలుసన్నారు. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
మరిన్ని వార్తల కోసం