
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ఖానాపూర్ఎమ్మెల్యే రేఖానాయక్ మంగళవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్లెవెల్ఒక్కసారిగా పెరగడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్ తో కలిసి ఎమ్మెల్యే రేఖానాయక్ హెలికాప్టర్ లో సదర్మట్, చనాఖా కోర్ట, గడ్డెన్న ప్రాజెక్టు సందర్శించి తిరిగి నిర్మల్కు వచ్చారు.
అక్కడ భోజనం కోసం వెళ్తుండగా స్థానిక ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయారు. అక్కడున్న అధికారులు వెంటనే స్పందించి డాక్టర్లను పిలిపించి వైద్యసేవలు అందించారు. బీపీ, షుగర్లెవల్ పెరగడంతో ఇలా జరిగిందని డాక్టర్లు తెలిపారు.