రాయికల్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి సహకారంతోనే జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్సంజయ్కుమార్తెలిపారు. బుధవారం రాయికల్మండలం శ్రీరాంనగర్, భూపతిపూర్, ఒడ్డెలింగాపూర్, కట్కాపూర్, రాయికల్గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఎస్సీ సబ్ప్లాన్ కింద మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంతో కలిసి పని చేయడం వల్లే జగిత్యాల, రాయికల్మున్సిపాల్టీలకు ఎక్కువ నిధులను తీసుకొస్తున్నట్లు చెప్పారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కోటి రూపాయలు తీసుకువచ్చి పనులు చేపట్టుతున్నట్లు వివరించారు. రాయికల్పట్టణంలో ఇరుకు రోడ్లు ఉన్నాయని, డ్రైనేజీలపై స్లాబ్వేసి వాటిని వెడల్పు చేస్తామని వివరించారు. అర్హులైన అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. అనంతరం రాయికల్పట్టణంలోని గుడేటి రెడ్డి సంఘంలో 27 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్, 37 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
తాగునీటి సమస్య తీర్చాలని వినతి
భూపతిపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు తమకు తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని, మినీ వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు.
