లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభించిన ఎమ్మెల్యే

లక్ష్మీనరసింహస్వామి జాతర ప్రారంభించిన ఎమ్మెల్యే
  • బ్యానర్ పై ఫొటో లేకపోవడంతో ఈవో పై ఆగ్రహం 

శివ్వంపేట, వెలుగు : శివ్వంపేట మండలం సికింద్లాపూర్ లక్ష్మీనర్సింహ స్వామి జాతరను ఆదివారం నర్సాపూర్​ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు.  ప్రతి ఏటా సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం మొదలయ్యే ఈ జాతర ఎనమిది వారాల పాటు కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్​ జిల్లాతో పాటు, హైదరాబాద్​ నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇదిలా ఉండగా జాతర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్​ పై తన ఫొటో ఎందుకు పెట్టలేదని ప్రోటోకాల్ పాటించరా అని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఈవో శశిధర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట జడ్పీటీసీ మహేశ్ గుప్తా,  ఆలయ ప్రధాన పూజారి ధనుంజయ శర్మ,  సర్పంచ్ సుధాకర్ రెడ్డి, లావణ్య, అశోక్ రెడ్డి, యాద గౌడ్, మహేందర్ రెడ్డి, హనుమంత రెడ్డి, శ్రీశైలం, భిక్షపతి రెడ్డి ఉన్నారు.