రేపు (అక్టోబర్9) బస్ చార్జీలపై బీఆర్ఎస్ నిరసనలు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్

రేపు (అక్టోబర్9) బస్ చార్జీలపై బీఆర్ఎస్ నిరసనలు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్
  • ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలకు ఫ్రీ బస్​అంటూనే పురుషులకు మాత్రం బస్​చార్జీలను పెంచేశారని బీఆర్ఎస్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​విమర్శించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రూ.10 పెంచారని ఆరోపించారు. బస్​చార్జీల పెంపు పేదలకు భారంగా మారిందన్నారు. మంగళవారం ఆయన ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్​రావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. "ఆర్టీసీ బస్సు చార్జీల పెంపునకు నిరసనగా గురువారం సిటీలో ఆందోళనలు చేస్తాం. 

చలో బస్​భవన్​ కార్యక్రమం నిర్వహిస్తాం. ఇందులో భాగంగా.. కేటీఆర్​, హరీశ్​ రావు సహా సిటీ ఎమ్మెల్యేలంతా బస్సుల్లో ప్రయాణం చేసి బస్​భవన్​కు చేరుకుంటారు" అని తలసాని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. రెగ్యులర్​ఆర్టీసీ ఉద్యోగులను తీసేసి ఔట్​ సోర్సింగ్​ఉద్యోగులను నియమిస్తున్నారని మండిపడ్డారు.