కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి : వివేక్​ వెంకటస్వామి

కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్​/చెన్నూరు/జైపూర్, వెలుగు: డాక్టర్​బీ.ఆర్. అంబేద్కర్ ఆశయమైన కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ఆదివారం అంబేద్కర్​జయంతిని పురస్కరించుకొని చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మార్కెట్, రామకృష్ణాపూర్​ కాంగ్రెస్ ఆఫీస్, వారాంతపు సంత, భీమారం, చెన్నూరు, జైపూర్​ మండలంలోని పెగడపల్లిలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్సీలు సతీశ్​కుమార్, వెంకట్రావు, మాజీ జడ్పీ వైస్​ చైర్మన్​మూల రాజిరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. 

పంచశీల జెండాలను ఆవిష్కరించి అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వివేక్​ మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన కోసమే అంబేద్కర్​ రాజ్యాంగాన్ని రచించారని, ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ విగ్రహాలు ఆయనకే ఉన్నాయన్నారు. చదువుకుంటేనే సమాజంలో కుల వివక్ష పోతుందన్నారు.  పేదలకు ఉన్నత విద్యను అందించేందుకు కాకా వెంకటస్వామి అంబేద్కర్ ​పేరుతో కాలేజీని స్థాపించారని, అందులో వేల సంఖ్యలో విద్యార్థులకు ఫ్రీ అడ్మిషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. 

బాధిత కుటుంబాల పరామర్శ

రామకృష్ణాపుర్ అల్లూరి సీతారామరాజునగర్​లో  అనారోగ్యంతో మృతి చెందిన నల్లగొండ కొమురయ్య, గంపల రాయనర్సు కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు.చెన్నూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ లీడర్​ మధు కుమారుడు అమరదీప్, క్యాతనపల్లి మున్సిపాలిటీలోని అమ్మగార్డెన్​ ఏరియాకు చెందిన గోపతి బానేశ్​ బర్త్​డే వేడుకల్లో ఎమ్మెల్యే వివేక్​ హాజరై వారిని ఆశీర్వదించారు.  జైపూర్​ మండలం వేలాల గ్రామంలో కాంగ్రెస్ లీడర్​ ఓగ్గు శంకర్​ మనవరాలు నామకణోత్సంలోనూ ఎమ్మెల్యే పాల్గొన్నారు.