భూ దందా,ఇసుక మాఫియాలకు ఎమ్మెల్యే వివేక్ వార్నింగ్

భూ దందా,ఇసుక మాఫియాలకు ఎమ్మెల్యే వివేక్ వార్నింగ్

కోల్బెల్ట్ /బెల్లంపల్లి: కార్మికుల హక్కుల కోసం కొట్లాడే కుటుంబం తమదని చెన్నూర్ ఎమ్మె ల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. గత ప్రభుత్వంలో నడిచిన మట్టి, బియ్యం, ఇసుక, భూ దందాలు తాము ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత బంద్ అయినట్లు చెప్పారు. దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలలో ఆదివాసి కార్మిక సంఘానికి ముగ్గురుఎమ్మెల్యేలు వివేక్ (చెస్పూర్), వినోద్ (బెల్లంపల్లి) వెడ్మబొజ్జు (ఖానాపూర్ ) మద్దతు తెలిపారు. 

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఆదివాసి కార్మిక సంఘం తరపున కాసిపేట మండలానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ విక్రమ్ రావు పోటీ చేస్తున్నాడని, కార్మికులందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... విక్రమ్ రావుకు కార్మికులు మద్దతు తెలిపి ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నా రు. బీఎఫ్లోర్లో ఉన్న సింగరేణి సంస్థను మూతపడకుండా లక్ష ఉద్యోగాలు కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిది అన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద సంస్థ సింగరేణి అన్న ఎమ్మెల్యే.. మూత పడిన ఆర్ఎఫ్ఎసీఎల్ సంస్థను ప్రారంభించేందు కు తమ నాన్న కాకా, తాను చాలా కృషి చేసినట్లు చెప్పారు. మాఫియా దందాలను తాము సహించమన్నారు.

►ALSO READ | కేసీఆర్ వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుండు కానీ..పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వలేదు

కార్మికుల హక్కుల కోసం పని చేస్తాం : ఎమ్మెల్యే వినోద్

తాము కార్మికుల హక్కుల కోసం పని చేస్తామని, వారి సమస్యలు తీరుస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ఎన్నికల్లో విక్రమావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓరియంట్ కంపెనీ కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెద్మ బొజ్జు మాట్లాడుతూ.. దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఫ్యాక్టరీలో ఆదివాసులు ఎక్కువగా ఉంటారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆదివాసీలు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం ఆదివాసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని వెల్లడించారు.