మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : జీవన్ రెడ్డి

మహిళా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ  ధ్యేయం : జీవన్ రెడ్డి

జగిత్యాల రూరల్, వెలుగు: మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాలలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మెప్మా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని పలువురు రిసోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లు ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుKarతూ ఆర్పీలకు పెండింగ్​వేతనాలతోపాటు రూ.10 వేల గౌరవవేతనం అందేలా చూస్తామన్నారు. 

రాయికల్​, వెలుగు: గతంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు రిపేర్లు చేస్తామని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. రాయికల్​ మండలం అయోధ్య, రాజనగరం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ముందుగా అయోధ్య రామాలయంలో పూజలు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. రామాలయ రోడ్డు నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేశారు. పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  డీఈ మిలింద్​, లీడర్లు గోపి రాజరెడ్డి, మండ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సుదర్శన్​రెడ్డి, వినోద్​రావు, జగదీశ్వర్​రెడ్డి పాల్గొన్నారు.