ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బూతు పురాణం

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బూతు పురాణం

మాజీ మంత్రి, ప్రస్తుత టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. తాండూర్ సిఐ రాజేందర్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడు రోజుల క్రితం తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వర స్వామి జాతరలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయులకు రెడ్ కార్పెట్ వేయడంపై మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్ కార్పెట్ ఎందుకు వేశారంటూ కోపంతో ఊగిపోయిన టీఆర్ఎస్ నేత.. అసభ్య పదజాలంతో సీఐపై విరుచుకుపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్డియారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫైలట్ రోహిత్ రెడ్డి అధికార టీఆర్ ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు నెలకొంది. వీరిరువురి పోరుతో తాండూరులో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు సైతం భయాందోళనకు గురవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

చైనీయుల ప్రతి రక్తపు బొట్టుకూ ప్రతీకారం తీర్చుకుంటాం

పెట్రో ధరలు రాష్ట్రాలే తగ్గించాలన్న మోడీపై కాంగ్రెస్ ఫైర్