ముంబై : క్లౌడ్ టెక్నాలజీలకు మంచి భవిష్యత్ ఉందని, చాలా కంపెనీలు ఈ టెక్నాలజీలకు మారుతున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. క్లౌడ్ టెక్నాలజీ ఐటీ రంగానికి కీలకంగా మారిందని కామెంట్ చేశారు. క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు జీడీపీ గ్రోత్కు ఎంతో సాయపడతాయని అన్నారు. ‘‘మైక్రోసాఫ్ట్ తయారు చేసిన పవర్యాప్స్సాయంతో స్టేట్ బ్యాంక్ తన ఏటీఎంలను వికలాంగులు ఈజీగా వాడుకునేలా చేసింది. మా అజ్యూర్ ఏఐ టెక్నాలజీ ద్వారా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వశాఖ భాషిణి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీనివల్ల భాషా సమస్యలు దూరమయ్యాయి. ట్రాన్స్లేషన్ ఈజీగా మారింది. ప్రాజెక్టు సైట్లలో ఏం జరుగుతున్నదో రియల్ టైంలో తెలుసుకోవడానికి లార్సన్ అండ్ టూబ్రో మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఐఓటీ, ఏఐలను వాడుతోంది.
కస్టమర్ టచ్పాయింట్ల నుంచి డేటాను తీసుకొని సెంట్రలైజ్డ్ సిస్టమ్లో రికార్డు చేయడానికి సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ను ఉపయోగిస్తోంది. ఎయిరిండియా కూడా మా కంపెనీ 365 టూల్స్, సెక్యూరిటీ సొల్యూషన్స్ను వాడుతోంది”అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఆయన ముంబైలో నిర్వహించిన ఫ్యూచర్ రెడీ లీడర్షిప్ సమిట్లో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ఈవారంలో ఆయన ఢిల్లీ, బెంగళూరు వెళ్లి కస్టమర్లు, స్టార్టప్లు, డెవెలపర్స్, ఎడ్యుకేటర్స్, స్టూడెంట్స్తో భేటీ అవుతారు. భారత ప్రభుత్వం పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భారీగా పెంచుతోందని ప్రశంసించారు. సత్య నాదెళ్ల హైదరాబాద్లోనే పుట్టిపెరిగారు. ఇదిలా ఉంటే యెస్బ్యాంక్ తన కస్టమర్లకు మరింత సమర్థంగా సేవలు అందించేలా యాప్ తీసుకురావడానికి మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకుంది. క్లౌడ్ సేవల కోసం హెచ్డీఎఫ్సీ కూడా ఈ ఐటీ కంపెనీతో చేతులు కలిపింది.