హైదరాబాద్, వెలుగు: మొబైల్ ఫోన్లను విక్రయించే లాట్ మొబైల్స్ తమ 10 వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ ఆఫర్లను ప్రకటించింది. సౌత్ ఇండియాలో లాట్ మొబైల్స్ ఓ సంచలనం సృష్టించిందని, లాట్ షోరూమ్లన్నింటినీ అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశామని సంస్థ డైరెక్టర్ ఎం. అఖిల్ అన్నారు. అన్ని బ్రాండ్ల మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, హోం థియేటర్లు, లేటెస్ట్ యాక్సెసరీలు తమ వద్ద దొరుకుతాయని చెప్పారు. త్వరలో ఇన్వర్టర్లు, ప్రింటర్లను కూడా లాట్ స్టోర్ల ద్వారా అమ్ముతామని పేర్కొన్నారు. 10 వ యానివర్సరీ సందర్భంగా ప్రతీ స్మార్ట్ఫోన్ కొనుగోలుపై ఫైర్ బోల్ట్ కాలింగ్ వాచ్ లేదా మాక్సెల్ టవర్ ఫ్యాన్లను కంపెనీ కాంబో ఆఫర్గా అందిస్తోంది. రూ. 9,999 కే స్మార్ట్టీవీని రూ. 17,499 కే ల్యాప్టాప్లను లాట్ మొబైల్స్ అమ్ముతోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై 7.5 శాతం వరకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ను ఆఫర్ చేస్తోంది.
అంతేకాకుండా వివో స్మార్ట్ మొబైల్స్పై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ను, ఒప్పో మొబైల్స్పై 4 వేల వరకు క్యాష్ బ్యాక్ను అందిస్తోంది. శామ్సంగ్ మొబైల్స్ 10 వేల వరకు అప్గ్రేడ్ బోనస్ను, వన్ ప్లస్ మొబైల్స్పై రూ. 1,000 నుంచి రూ. 6 వేల వరకు క్యాష్ బ్యాక్ను ఆఫర్ చేస్తోంది. వన్ ప్లస్, ఎంఐ, రియల్మీ టీవీలపై రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్ను ఇస్తున్న ఈ సంస్థ, మొబిక్విక్ ద్వారా ట్రాన్సాక్షన్లు చేస్తే 4 శాతం వరకు, పేటీఎం ద్వారా చేస్తే 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ను అందిస్తోంది. అంతేకాకుండా జీరో వడ్డీకే ఈఎంఐ సదుపాయాన్ని కలిపిస్తోంది. డెబిట్ కార్డుపై కేవలం ఒక్క రూపాయి చెల్లించి మొబైల్ను కొనుగోలు చేసుకునే అవకాశాన్ని ఇస్తోంది.