
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పలు చోట్ల శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. రాజంపేట మండలం ఆర్గొండలో 74 మి.మీ. వర్షపాతం నమోదైంది.
నస్రుల్లాబాద్లో 57.3 మి.మీ., దొమ్మదేవునిపల్లిలో 53.8 మి.మీ., జుక్కల్లో 43 మి.మీ., బాన్సువాడ మండలం కొల్లూర్లో 41.8 మి.మీ., కామారెడ్డిలో 39.8 మి.మీ., దోమకొండలో 39.8 మి.మీ., పాతరాజంపేటలో 39.3 మి.మీ., తాడ్వాయిలో 6.3 మి.మీ., రామారెడ్డిలో 36 మి.మీ., పుల్కల్లో 31.5 మి.మీ., బీర్కూర్లో 30 మి.మీ., లచ్చాపేటలో 25. 8 మి.మీ., ఎల్పుగొండలో 21 మి.మీ., బిచ్కుందలో 20.8 మి.మీ., వర్సపాతం నమోదైంది. ఆదివారం పొద్దంతా ఆకాశం మబ్బు పట్టి ఉంది. అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి.