
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ఫండ్ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ ఏడాది మే నెలలో భారీ వృద్ధిని నమోదు చేసింది. రికార్డు స్థాయిలో 20.06 లక్షల మంది కొత్త మెంబర్లు చేరారు. ఈ సంఖ్య ఈపీఎఫ్ఓ చరిత్రలోనే ఒక నెలలో నమోదైన అత్యధిక నెట్ పేరోల్ అడిషన్. కొత్తగా చేరిన వారిలో 9.42 లక్షల మంది మొదటిసారిగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చినవారు. వీరిలో 18-–25 సంవత్సరాల మధ్య వయసు గల యువత సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నెలలో చేరిన మొత్తం సభ్యులలో 14.37 లక్షల మంది పురుషులు కాగా, 5.69 లక్షల మంది మహిళలు ఉన్నారు. 16.11 లక్షల మంది గతంలో ఉద్యోగాలు వదిలి, తిరిగి ఈపీఎఫ్ఓలో చేరారు.