ఎల్బీనగర్, వెలుగు: గోల్డ్ ట్రేడింగ్ పేరుతో మహిళ నుంచి రూ.23.15 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలో నివాసం ఉండే రచన నల్గొండ జిల్లాలో హార్టికల్చర్ ఆఫీసర్గా చేస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు ‘గోల్డ్ ట్రేడింగ్ 3038’ పేరుతో వాట్సప్లో ఆమెను కాంటాక్ట్ అయ్యారు. హెడ్ఆఫీస్ మలేషియాలో ఉందని నమ్మించారు. పీఓఎం గోల్డ్ యాప్ లింక్ ఆమెకు పంపించారు. అందులో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభాలు వస్తాయని, ముందుగా రూ . 5,000 డిపాజిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాని సూచించారు. తర్వాత రూ. 5 లక్షలు డిపాజిట్ చేయడం ద్వారా వీఐపీ సభ్యత్వంలో చేరాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దాంతో రూ .5 లక్షలు చెల్లించింది. రెండు రోజుల తర్వాత మరో రూ.3 లక్షల స్కీమ్లో చేరాలని చెప్పడంతో తన డబ్బులు వెనక్కు ఇవ్వాలని కోరింది. రూ .25 లక్షలు అయిన తర్వాత డబ్బులు విత్ డ్రా చేయగలరని చెప్పారు. 15 % పన్ను కింద రూ .3.75 లక్షలు, గుర్తింపు తనిఖీకి మరో రూ.5 లక్షలు.. ఇలా 23.5 లక్షలు వసూలు చేశారు. డబ్బులు విత్ డ్రా కాకపోవడం, ఎవరూ స్పందించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి రచన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె డబ్బులు పంపించిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోల్డ్ ట్రేడింగ్ పేరుతో రూ. 23 లక్షలు కాజేసిన్రు
- హైదరాబాద్
- July 10, 2022
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ