ఒకే వివాహవేదికపై పెళ్లిళ్లు చేసుకున్న తల్లీ,కూతురు

ఒకే వివాహవేదికపై పెళ్లిళ్లు చేసుకున్న తల్లీ,కూతురు

సామూహిక వివాహాల్లో భాగంగా ఓ యువతితో పాటు ఆమె తల్లి కూడా పెళ్లి చేసుకుంది. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. గోరఖ్ పూర్ లోని పిప్రోలీ ప్రాంతంలో ఇటీవల సీఎం సామూహిక్ వివాహ్ యోజన కింద ఈ పెళ్లిళ్ల కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బేలి దేవి అనే 53 ఏళ్ల మహిళ తన సొంత మరిదిని పెళ్లాడగా, ఆమె కుమార్తె ఇందు (27) ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుంది.

బేలిదేవి భర్త హరిహర్ పాతికేళ్ల కిందట చనిపోయాడు. ఈ క్రమంలో ఆమె తన చిన్నమరిది జగదీశ్ (55)తో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. జగదీశ్ ఇప్పటివరకు అవివాహితుడిగానే ఉన్నాడని..దీంతో తన మరిదిని చేసుకోవాలని నిర్ణయించుకోగా.. తన పిల్లలందరూ సంతోషం వ్యక్తం చేశారని బేబి దేవి తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారంతా  జీవితంలో స్థిరపడ్డారు.

ఆమె చిన్న కుమార్తె ఇందు ఈ కార్యక్రమంలో రాహుల్ (29) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తల్లి మళ్లీ పెళ్లిచేసుకోవడంపై సంతోషం వ్యక్తం చేసింది. అమ్మ, అంకుల్ జోడీ బాగుందని తెలిపింది.