హైదరాబాద్ : ఇద్దరు పిల్లలతో తల్లి మిస్సింగ్

హైదరాబాద్ : ఇద్దరు పిల్లలతో  తల్లి  మిస్సింగ్

జీడిమెట్ల, వెలుగు: ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన సూరారం పోలీస్​ స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సూరారం లక్ష్మీనగర్​కాలనీకి చెందిన సురేశ్​ లైన్​మెన్​గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఉమాదేవితో 19 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. 

సురేశ్​ శనివారం డ్యూటీకి వెళ్లిన సమమంలో భార్య ఉమాదేవి ఇంట్లో ఉన్న కుమారుడు, కాలేజీలో ఉన్న కుమార్తెను తీసుకుని ఇంటినుంచి వెళ్లిపోయింది. ఫోన్​ఇంట్లోనే పెట్టిపోవడంతో చుట్టుపక్కల ప్రదేశాలు, బంధువుల ఇండ్లలో చూసినా ప్రయోజనం లేకపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.