సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడొద్దన్నందుకు బాలుడి ఆత్మహత్య

సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడొద్దన్నందుకు  బాలుడి ఆత్మహత్య

జగిత్యాల టౌన్, వెలుగు : ఎప్పుడూ సెల్​ఫోన్​లో గేమ్స్​ఆడుతున్న కొడుకును తల్లి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల రూరల్ తిప్పన్నపేట గ్రామానికి చెందిన మ్యాడ నరేశ్​, -జల కొడుకు సాయి చరణ్ (13). ఇతడు ఓ ప్రైవేట్​స్కూల్​లో 9వ తరగతి చదువుతున్నాడు. తండ్రి నరేశ్​ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా, తల్లి జల బీడీలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటోంది.  మంగళవారం ఉదయం బాలుడు కాలు జారి కిందపడడంతో దెబ్బ తాకింది. దీంతో తల్లి స్కూలుకు వెళ్లొద్దని చెప్పింది. దీంతో సాయి చరణ్​సెల్​ఫోన్​లో గేమ్స్​ఆడుతూ కనిపించాడు. ఎంతసేపయినా ఆపకపోవడంతో విశ్రాంతి తీసుకోవాలని, ఎప్పుడూ ఫోన్​లో ఆడుతున్నావెందుకని తల్లి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సాయి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై సధాకర్ కేసు నమోదు చేశారు.