‘420’లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు..బీజేపీపై నటుడు ప్రకాశ్ రాజ్ కామెంట్

‘420’లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు..బీజేపీపై నటుడు ప్రకాశ్ రాజ్ కామెంట్

బెంగళూరు : కేంద్రంలోని అధికార బీజేపీపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘420’ లు (మోసగాళ్లు) వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామ ని అంటున్నారని, ఇవి అహంకారం తో కూడిన వ్యాఖ్యలని అన్నారు. ఆదివారం చిక్కమంగళూరులో ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడా రు. ‘‘లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తామని

‘420’లు చెబుతున్నా రు. ఏ పార్టీ అయినా సరే అలా చెప్పడం అహంకారమే.  ప్రజాస్వా మ్యంలో ఒకే పార్టీ 400 అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుచుకునే ఛాన్స్  లేదు. ఓ రాజకీయ పార్టీ తాము ఇన్ని సీట్లు గెలుస్తామని ఎలా చెబుతుంది? ఇది ముమ్మాటికీ అహంకారమే’’ అని ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.