చేర్యాల, వెలుగు: పదేళ్లలో చేర్యాలను విధ్వంసం చేసిన బీఆర్ఎస్ను వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ కేంద్రంలోని కొమ్మూరి క్యాంప్ ఆఫీసులో జనగామ నియోజక వర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాపరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించి విధ్వంసం చేశారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో కోట్లు దండుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఓట్లను ఎక్కువగా నమోదు చేసుకుని దొంగ ఓట్లతో గెలిచారని ఆరోపించారు.
మోసపూరితంగా వ్యవహరించే పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చేర్యాలలో కాంగ్రెస్ గెలిచే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ప్రెస్మీట్లో నాయకులు కొమ్మూరి ప్రశాంత్రెడ్డి, మాజీ జడ్పీటీసీ గిరి కొండల్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము రవి, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు కాటం సంజీవులు, మేర్గు శ్రీనివాస్, మేర్గు కృష్ణ, నర్సింగరావు, కళావతి, చంద్రయ్య, లక్ష్మీనారాయణ, రాజిరెడ్డి, ఆగంరెడ్డి పాల్గొన్నారు.
