
- అసెంబ్లీలో చర్చకు రావాలని మాజీ సీఎంకు సవాల్
- జనగామలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ
జనగామ, వెలుగు: ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టు పాపం మాజీ సీఎం కేసీఆర్దేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే దీనిపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సవాల్చేశారు. గురువారం జనగామ జిల్లాకేంద్రంలోని సాయిరాం కన్వెన్షన్ హాల్ లో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఇందులో 816 మంది లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డితో కలిసి ఆయన చీఫ్ గెస్ట్గా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్.. బనకచర్ల బంకమట్టిని తెచ్చి తమకు రుద్దుతూ తెలంగాణ సెంటిమెంట్రగుల్చుతానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నిసార్లు సవాల్చేసినా కూడా కేసీఆర్అసెంబ్లీకి ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. ఇప్పటికైనా గత పదేండ్ల పాలన, ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సూచించారు. కాంగ్రెస్ప్రభుత్వ ప్రజాపాలనలో అందరి సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. దీన్ని ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్సర్కార్ పై చెడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇండ్లకు ఆగస్టు 15 లోపు వంద శాతం గ్రౌండింగ్చేయాలని సూచించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేశ్కుమార్, ఆర్డీఓ గోపీ రామ్, మున్సిపల్కమిషనర్వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ యువజన సంఘం రాష్ట్ర నేత కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, జనగామ అగ్రికల్చర్ మార్కెట్కమిటీ చైర్మన్బనుక శివరాజ్యాదవ్, ఆర్టీఐ మెంబర్అభిగౌడ్తదితరులు పాల్గొన్నారు.