ఎంపీ ధర్మపురి అర్వింద్
నందిపేట, వెలుగు : ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వరదలతో పంట నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. నిజామాబాద్జిల్లా నందిపేట మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు. వెల్మల్ గ్రామంలో 50 డబుల్బెడ్రూం ఇళ్ల కోసం తవ్వి వదిలేసిన గుంతలు నీటితో నిండిపోయాయని అన్నారు. గ్రామంలో బైపాస్ రోడ్డుకు శంకుస్థాపన చేసి ఐదేళ్లయినా ఇప్పటికీ రోడ్డు పూర్తి కాలేదన్నారు. తల్వేద గ్రామంలో వరద ధాటికి కొట్టుకుపోయిన రోడ్డును పరిశీలించారు. గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు హామీ ఇచ్చి ఇప్పటికీ స్థల సేకరణ చేయలేదన్నారు. జిల్లాలో 30 వరకు చెక్డ్యాంల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఫండ్స్కేటాయించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చి కార్యకర్తలతో నాసిరకంగా పనులు చేయించడం వల్ల అవి తెగిపోయి పంటలకు నష్టం వాటిల్లిందన్నారు.
ఫసల్బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అయిలాపూర్లో ఇటీవల గ్రామీణ సడక్ యోజన కింద నిర్మించిన రోడ్డు వరదలకు కొట్టుకుపోయిందని, క్వాలిటీతో పనులు చేయించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. నందిపేట మండలంలో 60 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయన్నారు. కలెక్టర్తో మాట్లాడి నియోజకవర్గంలో ఎంత నష్టం జరిగిందో రిపోర్టు తెప్పించి కేంద్రం పరిధిలోని హైపవర్ కమిటీకి పంపిస్తామన్నారు. ఏ సహాయం వచ్చినా కేంద్రం నుంచి రావాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదన్నారు. నందిపేట పాలిటెక్నిక్ కాలేజీ చుట్టూ నీరు చేరిందని, కట్టకింద టీఆర్ఎస్ నాయకులు అడ్డగోలుగా నిర్మాణాలు చేయడం వల్లే చెరువు నీరు వెళ్లే దారిలేక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంపీ వెంట పార్టీ ఆదిలాబాద్ ఇన్చార్జి అల్జాపూర్శ్రీనివాస్, కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, గంగాధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.