ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ సంజయ్ అగర్వాల్ తో సమావేశం అయ్యారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు పంట సాగు, నిజామాబాద్ పసుపు బోర్డు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీతోపాటు… ఆ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.
రెండు వారాల్లో పసుపు పంటకు సంబంధించిన Integrated nutrient management అంటే.. పంట నాణ్యతను పెంచే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ ఓ కార్యక్రమం నిర్వహించబోతోంది. పసుపు పంటకు సంబంధించి సమగ్రంగా ఈ కార్యక్రమంలో విశ్లేషిస్తారని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. ఈ సమావేశానికి తనతోపాటు… మరో ఇద్దరు పసుపు రైతులను కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు.