ఇద్దరు రైతులతో పసుపు బోర్డ్ మీటింగ్ కు ఎంపీ అర్వింద్

ఇద్దరు రైతులతో పసుపు బోర్డ్ మీటింగ్ కు ఎంపీ అర్వింద్

ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ సెక్రటరీ సంజయ్ అగర్వాల్ తో సమావేశం అయ్యారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. పసుపు పంట సాగు, నిజామాబాద్ పసుపు బోర్డు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సెక్రటరీతోపాటు… ఆ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

రెండు వారాల్లో పసుపు పంటకు సంబంధించిన Integrated nutrient management అంటే.. పంట నాణ్యతను పెంచే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ ఓ కార్యక్రమం నిర్వహించబోతోంది. పసుపు పంటకు సంబంధించి సమగ్రంగా  ఈ కార్యక్రమంలో విశ్లేషిస్తారని ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. ఈ సమావేశానికి తనతోపాటు… మరో ఇద్దరు పసుపు రైతులను కూడా తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన చెప్పారు.