మృతుల కుటుంబాలకు ఎంపీ వంశీ పరామర్శ

మృతుల కుటుంబాలకు ఎంపీ వంశీ పరామర్శ

ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందిన యువకుల కుటుంబాలను  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు.  మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు.  ప్రమాదవశాత్తు ఈతకు వెళ్ళి ఆరుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.   కొడుకులు లేని లోటును ఎవరూ తీర్చలేరని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఎంపీ.  

ఆరుగురు మృతి చెందితే అధికారులు నిర్లక్ష్యం వహించారని మృతుల కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో అధికారులు నిర్లక్ష్యం వీడాలి. ప్రాజెక్టు దగ్గర సేఫ్టీ ఇన్ స్ట్రక్షన్స్  పెంచాలి. ప్రాజెక్ట్ దగ్గరికి ఎవరు వెళ్లకుండా చూడాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు వంశీకృష్ణ.