మహిళల అభ్యున్నతితోనే దేశ ప్రగతి : ఎంపీ కడియం కావ్య

మహిళల అభ్యున్నతితోనే దేశ ప్రగతి : ఎంపీ కడియం కావ్య

శాయంపేట (ఆత్మకూర్), వెలుగు: దేశ ప్రగతి మహిళా అభ్యున్నతిపై ఆధారపడి ఉంటుందని వరంగల్​ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఆత్మకూర్​ మండలం పెద్దాపూర్​లో రూ.20 లక్షలతో నిర్మించనున్న మహిళా కమ్యూనిటీ హాల్​కు ఆదివారం వారు శంకుస్థాపన చేశారు.

 అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పని చేస్తుందన్నారు. కాంగ్రెస్​ ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటే ఓర్వలేని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మహిళలే గుణపాఠం చెప్తారన్నారు. 

కార్యక్రమంలో కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు కమలాపురం రమేశ్, ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బీరం సునందాసుధాకర్ రెడ్డి, పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్, మాజీ స్పర్పంచ్​పర్వతగిరి రాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికరాల వాసు, మండల అధికార ప్రతినిధి అబ్దుల్ కపూర్, పెద్దాపురం సొసైటీ వైస్ చైర్మన్ అంబటి రాజస్వామి తదితరులు పాల్గొన్నారు.

వైద్య శిబిరం ఏర్పాటు

పరకాల: హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేటలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం బైక్​ ర్యాలీ నిర్వహించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.