- కేంద్ర మంత్రికి ఎంపీ కడియం కావ్య విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: కాకతీయ వర్సిటీ రుస 2.0 (రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్) (రీసెర్చ్, ఇన్నోవేషన్) ప్రాజెక్టుల గడువు పొడిగించాలని కేంద్రాన్ని ఎంపీ కడియం కావ్య కోరా రు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాకతీయ యూనివర్సిటీకి రుస 2.0 కింద మొత్తం రూ.50 కోట్లు మంజూ రయ్యాయని, రూ.35 కోట్లు పరిశోధనల కోసం కేటాయించారని వివరించారు.
