హైదరాబాద్ : లాక్ డౌన్ క్రమంలో పలువురు సేవాదృక్పదంతో పేదలకు కూరగాయలు, నిత్యవసర సరుకులు ఫ్రీగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీ మణి కావ్య కిషన్ రెడ్డి మంచి మనసు చాటారు. బర్కత్ పురలోని బీజేపీ సిటీ ఆఫీస్ నుంచి ఇరవై రెండు టన్నుల కూరగాయలను పంపిణీ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బస్తీల్లో పేదలకు అందజేశాయించారు కావ్య కిషన్ రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె..లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులతో పాటు , ఫ్రెష్ గా కూరగాయలను నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా అందిస్తామన్నారు. లాక్ డౌన్ ముగిసేవరకూ ఈ పంపిణీ కొనసాగుతుందని… అందరూ ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సేఫ్ గా ఇంట్లోనే ఉండాలని సూచించారు కావ్యకిషన్ రెడ్డి.