‘శరద్ పవార్‌కి తెలియకుండా ఏదీ జరగలేదు’

‘శరద్ పవార్‌కి తెలియకుండా ఏదీ జరగలేదు’

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంపై తానేమి ఆశ్చర్యానికి గురికాలేదని హీరోయిన్, ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు.  ‘మహా’ రాజకీయంపై ఓ మీడియా చానల్‌ ఆమెను సంప్రదించగా ఈ విధంగా అన్నారు. ‘‘బీజేపీ, ఎన్‌సీపీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను ముందే ఊహించాను. దేవేంద్ర ఫడ్నవిస్ మరియు అజిత్ పవార్ ఇద్దరూ చాలా బలమైన నాయకులు. వారిద్దరూ ఎమ్మెల్యేలతో మంచి సత్సంబంధాలని కొనసాగిస్తారు. ఇద్దరూ కలిసి మహారాష్ట్రలో మంచి పాలనను అందిస్తారు. ఎన్‌సీపీ.. శివసేనకు వెన్నుపోటు పొడిచిందని సంజయ్ రౌత్ అన్నారు.. కానీ, శివసేనే సీఎం పదవి కోసం ఆశపడి.. బీజేపీకి వెన్నపోటు పొడిచింది. అజిత్ పవార్.. శివసేనకు వెన్నుపోటు పొడిచారనడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. వెన్నుపోటు అనే మాట సంజయ్ రౌత్ మాట్లడడాన్ని నేను ఒప్పుకోను. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంపై ఏమీ తెలియదన్న శరద్ పవార్‌ మాటలను నేను నమ్మను. ఇండియాలో రాజకీయాలలో ఏం జరిగినా అది శరద్ పవార్‌కి తెలుస్తుంది. మహారాష్ట్రలో ఏం జరగుతుందో, ఆయన కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా శరద్ పవార్‌కి తెలుసు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శరద్ పవార్ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది’.