
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లి రైల్వే గేటును ఎంపీ రఘునందన్ రావు సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రేడియల్ రోడ్డు విస్తరణ పేరుతో కొన్ని నెలలుగా వెలిమెల వైపు వెళ్లే రైల్వే గేటును మూసివేశారని దీనివల్ల స్థానికులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. రైల్వే మంత్రి, రాష్ట్ర అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించామన్నారు.
నాగులపల్లితో పాటు తెల్లాపూర్లో ఆర్ఓబీల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు రాంబాబు గౌడ్, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు పాల్గొన్నారు.