దళిత బంధు అడిగాడని వ్యక్తిపై ఎంపీటీసీ దాడి

దళిత బంధు అడిగాడని వ్యక్తిపై ఎంపీటీసీ దాడి

సిద్దిపేట, వెలుగు:   సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం బీజీ వెంకటాపూర్ లో దళితబంధు తమకెందుకివ్వరని అడిగితే ఎంపీటీసీ దాడి చేసినట్లు ఓ వ్యక్తి ఆరోపించాడు.  మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత గ్రామానికి చెందిన యాదగిరి  తమకెందుకు దళిత బంధు ఇవ్వరని, తాము అర్హులం కామా? అని ఎంపీటీసీ కిరణ్​ గౌడ్ ను  నిలదీశాడు.  దీంతో తీవ్ర ఆవేశానికి  గురైన ఎంపీటీసీ కిరణ్​ గౌడ్  తనను ప్రశ్నించిన యాదగిరి చెంపపై కొట్టాడు. 

దీంతో బాధితుడు జగదేవ్ పూర్ పోలీసులను ఆశ్రయించడంతో గ్రామానికి చెందిన పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.  గజ్వేల్ నియోజకవర్గంలోని మునిగడప గ్రామంలో దళిత బంధు ఇవ్వాలని దళితులు రాస్తారోకో నిర్వహించారు.