
హైదరాబాద్, వెలుగు : ఎపిక్ న్యూ స్విప్ట్ కొత్త మోడల్ ను హైదరాబాద్ మార్కెట్లో మారుతి సుజుకీ వి డుదల చేసింది. నగరంలోని ఎల్.బి.నగర్లో గల మారుతి సుజుకీ ఎరినా కళ్యాణి మోటార్స్ లో ఈ కారును టాలీవుడ్ నటి, బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య ఆవిష్కరించారు.
సత్యతో పాటు మారుతీ సుజుకీ టీఎస్యం సూర్య, కళ్యాణి మోటార్స్ సీఈఓ వేంకటేశ్వరరావు, బ్రాంచీ ఏజీయం రాజ్ కుమార్, తదితరులు కలిసి మొదటి 5 మంది వినియోగదారులకు కార్లను డెలివరీ చేశారు.
ఇప్పటి వరకు వందకు పైగా బుకింగ్లు నమోదయ్యాయని కళ్యాణి మోటార్స్ సీఈ ఓ వేంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఎపిక్ న్యూ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ లీటరకు 25.75 కి.మీ మైలేజ్ ఇస్తోంది.